దీపావళి రోజు అభ్యంగన ఎందుకు చేయాలో తెలుసా..

దీపావళి రోజు అభ్యంగన  ఎందుకు చేయాలో తెలుసా..

దీపావళి రోజున అభ్యంగనస్నానం చేయాలని చెబుతుంటారు.   అభ్యంగన స్నానం అంటే శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దన చేసి కుంకుడుకాయలతో  తల రుద్దుకొని స్నానం చేయాలని పండితులుచెబుతున్నారు.  అంతేకాకుండా దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించాలంటున్నారు పండితులు. 

దీపావళి ఈ నెల 12వ తేదీన వచ్చింది. పైగా ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆఫీసులకు సెలవు కావడంతో పండగను మరింత వేడుకగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీపావళి రోజున ఏం చేయాలి? లక్ష్మీదేవి ఏ సమయంలో పూజించాలి? అన్న అనుమానాలు అందరిలోనూ సహజంగా కలుగుతాయి. దీపావళి అంటే దీపాల పండగ. సాయంత్రానికి ఇంటి ముందు దీపాలు వెలిగించడమే కాకుండా బాణాసంచా ను కాలుస్తూ పిల్లలతో కలసి పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు

ఆదివారమే దీపావళి... ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల అనారోగ్యాలు ఏవైనా ఉంటే దూరమవుతాయని పండితులు చెబుతారు. . ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదంటారు. ఈరోజు బంగారం కొంటే మంచిదని భావిస్తారు. అంతేకాదు ధనత్రయోదశి నాడు దానధర్మాలు చేయడం ఉత్తమమని పండితోత్తములు చెబుతున్నారు. 

 లక్ష్మీదేవిని భక్తి శ్రద్థలతో పూజిస్తే .  ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు.. సిరులు ఉంటాయని చెబుతారు. అందుకే కొత్తగా బంగారం కొనుగోలు చేసి మరీ అనేక మంది లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. కేవలం సిరిసంపదలు మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతారు. అందుకే ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు.  అలాగే చేయడం వల్ల భోగభాగ్యాలతో జీవిస్తారన్న నమ్మకం అందరిలోనూ ఉంది.