హైదరాబాద్సిటీ, వెలుగు: నగరానికి చెందిన ప్రముఖ డెంటిస్ట్, డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ అండ్ సీఈవో డాక్టర్ స్నిగ్ధా గౌడ్ ‘అలైనర్ స్పెషలిస్టు ఆఫ్ది ఇయర్’ గౌరవాన్ని పొందారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘డెంటల్ ఆస్కార్’గా పిలిచే ప్రతిష్టాత్మకమైన ఫామ్డెంట్ఎక్స్లెన్స్అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలంగాణ ఆర్థోడెంటిస్ట్గా ఆమె రికార్డు సృష్టించారు.
ఇండియన్స్కూల్ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) గ్రాడ్యుయేట్అయిన స్నిగ్ధా.. క్లినికల్ఎక్స్పర్టైస్గా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ స్నిగ్దా గౌడ్ 25 ఏండ్లుగా డెంటల్రంగంలో సేవలందిస్తున్నారు. క్లిష్టమైన అలైనర్ థెరపీ, హైబ్రిడ్ ఆర్థోడాంటిక్ మెకానిక్స్ సమస్యలను పరిష్కరించడంలో ఆమె ఎక్స్పర్ట్గా పేరుపొందారు. ఇన్విజాలైన్ ట్రీట్మెంట్లో వరుసగా మూడేళ్లు ప్లాటినం ప్రొవైడర్ గా నిలిచారు. ఇన్విజాలైన్ సంస్థ ఒక డాక్టర్ ఏడాదికి ఎన్ని క్లిష్టమైన కేసులను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారనే దానిపై ఆధారపడి ప్లాటినం ప్రొవైడర్అనే హోదాను ఇస్తారు.
ఈ లెక్కన డాక్టర్ స్నిగ్ధా ఏడాదికి కనీసం 60 నుంచి 100 కంటే ఎక్కువ ఇన్విజాలైన్ చికిత్సలను పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా ఆర్థోడెంటిస్ట్కూడా ఆమెనే కావడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ స్నిగ్ధ గౌడ్ మాట్లాడుతూ ‘ఈ అవార్డు మా రోగులు మాపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపం. ఆర్థోడాంటిక్స్ అంటే కేవలం పళ్లను సరిచేయడమే కాదు, ఒక వ్యక్తి రూపంలో, ఆత్మవిశ్వాసంలో సానుకూల మార్పు తీసుకురావడం" అని అన్నారు.
