జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం .. కోళ్లు, పశువులపై దాడి

జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం ..  కోళ్లు, పశువులపై దాడి

జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.  రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడుల వల్ల వీధుల్లో చిన్నారులు ఒంటరిగా తిరగాలంటే జంకుతున్నారని అంటున్నారు. ధర్మపురి మండలం ధమ్మనపేట గ్రామంలో అర్ధరాత్రి పిచ్చిక్కులు స్వైరవిహారం చేశాయి.  కోళ్లు, పశువులపై దాడి చేశాయి. అడ్డుకున్న ఐదుగురిని కరిచాయి కూడా. తీవ్ర గాయాలైనవారిని చికిత్సా నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కుక్కల బెడదను అరికట్టాలని అధికారులను వేడుకుంటున్నారు  గ్రామస్తులు.