- పట్టించుకోని జీహెచ్ఎంసీ సిబ్బంది
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఆవరణలో కుక్కల బెడద పెరిగిపోయింది. ఉదయం, రాత్రి సమయాల్లో ఆసుపత్రి మెయిన్బిల్డింగ్ పైఅంతస్తుల కారిడార్లో తిరుగుతుండటంతో పేషంట్లు, అటెండెంట్స్ఆందోళన చెందుతున్నారు.
గాంధీ మెయిన్ గేట్ వద్ద నిత్యం నిర్వహించే అన్నదానాల కార్యక్రమాలతో పెరుగుతున్న ఫుడ్ వేస్ట్, చెత్తాచెదారం కారణంగా కుక్కల సంఖ్య పెరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు.