దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వెయ్యి పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతోంది. నిప్టీ 300 పాయింట్లకు పైగా నష్టంతో 17 వేల దిగువన ట్రేడవుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా చేస్తున్న దాడులు యూరప్ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు ఇప్పటికీ భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
For More News..
కీవ్ నుంచి నిజామాబాద్ చేరుకున్న యువతి ఏం చెప్పిందంటే..