యాదాద్రి బంగారు తాపడానికి  విరాళాలు రూ. 19.29 కోట్లు

యాదాద్రి బంగారు తాపడానికి  విరాళాలు రూ. 19.29 కోట్లు


యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యవిమాన గోపుర బంగారు తాపడం కోసం వచ్చిన విరాళాల వివరాలను గురువారం ఆలయ ఆఫీసర్లు ప్రకటించారు. 2021 సెప్టెంబర్ 25 నుంచి 2022 మే 18 వరకు రూ.19 కోట్ల 29 లక్షల 42,975 విరాళంగా వచ్చాయి. దీంతోపాటు 7 కిలోల 298 గ్రాముల బంగారం అందినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.