వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్త.. రూమర్స్ కి మీదే బాధ్యత

వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్త.. రూమర్స్ కి మీదే బాధ్యత

సోషల్ మీడియా యాప్ వాట్సప్ లో  కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా వాట్సప్ గ్రూప్ లో తప్పుడు  వార్తలు ప్రచారం చేయొద్దని చెప్పారు హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడితూ.. తప్పుడు వార్తలకు పూర్తి బాధ్యత గ్రూప్ అడ్మినే వహించాలన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే అడ్మిన్ పై కేసులు నమోదు చేస్తామని, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రజల కోసమే పోలీస్ పెట్రోల్ వాహనం సిబ్బంది ఉన్నదని, ఈ సదుపాయాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు కమిషనర్. పోలీసులు నిరంతరం ప్రజల కోసం ఉన్న విషయాన్ని గమనించాలన్నారు.