అయోధ్య రామయ్య భక్తులకు శుభవార్త.. రామ్​ లల్లా హారతి ఇకపై దూరదర్శన్​ లో ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య రామయ్య భక్తులకు శుభవార్త.. రామ్​ లల్లా హారతి ఇకపై దూరదర్శన్​ లో ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య వెళ్లి బాలరాముడిని దర్శించుకోలేని వారికి దూరదర్శన్ ఛానల్ శుభవార్త చెప్పింది. రామ్ లల్లా భక్తులు ప్రతిరోజూ అయోధ్య నుంచి నేరుగా హారతి సేవలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని డీడీ ఛానల్ వెల్లడించింది. ఉదయం 6:30 గంటలకు అయోధ్యలోని రామ మందిరం నుంచి రోజు వారి హారతి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని దూరదర్శన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

అయోధ్య రామ్​లల్లా భక్తులకు దూరదర్శన్​ ఛానల్​ శుభవార్త ప్రకటించింది. రామ్​లల్లాకు ఉదయం 6.30 గంటలకు ఇచ్చే హారతిని దూరదర్శన్​ ప్రత్యక్ష ప్రపారం చేస్తామని దూరదర్శన్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయోధ్య రామాలయాన్ని వీక్షించేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తున్నారని ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో తెలిపింది. శ్రీరామ జన్మభూమి మందిరంలో ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

అయోధ్యలో బాలక్​ రాముడిని దర్శనం చేసుకొనేందుకు  రెండు గంటల సమయం పడుతుంది,   ఉదయం6.30 గంటలకు మంగళ హారతి, సాయంత్రం 6.15 గంటలకు శృంగ హారతి, రాత్రి 10 గంటలకు శయాన్ హారతి కోసం భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్ట్ తెలిపింది. అయితే ఉదయం 6.30 గంటల హారతిని దూరదర్శన్​ ప్రత్యక్షప్రసారం చేయనుంది. భక్తులు తమ సౌలభ్యం కోసం తమ మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, పర్సులు తదితరాలను ఆలయ ప్రాంగణం వెలుపల ఉంచాలని సూచించింది.

అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన రెండు నెలల తర్వాత, లోక్ సభ ఎన్నికలకు ముందు, జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్ ప్రతిరోజూ రామ్ లల్లా విగ్రహానికి చేసే ఉదయం ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి రామ్ లల్లాకు ఇచ్చే ‘హారతి’ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సాయంత్రం తెలిపారు. ఇప్పుడు, మీరు ప్రతిరోజూ మీ ఇంటి నుండి శ్రీ రామ్ లల్లా యొక్క దివ్య దర్శనం పొందగలుగుతారు  అని ఠాకూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  శ్రీరాముడిపై రామ భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసార భారతి ఈ పెద్ద సదుపాయాన్ని ప్రారంభించింది.