డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అర్హలైన వారికి ఇవ్వకుండా.. ఇండ్లు, స్థలాలు ఉన్నవారికే డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తుందని మండిపడ్డారు. 

స్థానికులకు కాకుండా వేరే ప్రాంతం వారికి ఇండ్లు కేటాయించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం అప్లై చేసి ఎన్ని సంవత్సరాలైన ఇప్పటివరకు ఇండ్లు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. 

Also Read :- కాంగ్రెస్ పార్టీ గతం..ఆ పార్టీ పని ఖతం: కేటీఆర్

లబ్ధిదారుల నిరసనతో రాజేంద్రనగర్ మున్సిపల్ ఆఫీస్ పరిధిలో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.