కరోనా సామాన్య ప్రజలను కాదు..వైరస్ సోకిన వారిని కాపాడే డాక్టర్లను కూడా వదలట్లేదు. ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మాజీ అధ్యక్షుడు కె.కె.అగర్వాల్ కరోనాతో మృతి చెందారు. కరోనా సోకిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
కె.కె.అగర్వాల్ కార్డియాలజిస్టుగా సేవలందించారు. 2010 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.