
పద్మారావునగర్ వెలుగు : టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన డాక్టర్ కోట నీలిమ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.