వైన్స్ లో తాగుతూ కుప్పకూలాడు

వైన్స్ లో తాగుతూ కుప్పకూలాడు

వైన్స్ షాప్ లో మందు తాగుతూ వ్యక్తి చనిపోయిన ఘటన హైదరాబాద్ శంషాబాద్ లోని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గొల్లపల్లి గ్రామానికి చెందిన కృష్ణ(50) రోజూ శంషాబాద్ లోని సప్తగిరి వైన్స్ లో మద్యం తాగేవాడు. మంగళవారం కూడా కృష్ణ అదే వైన్స్ లో మద్యం తాగేందుకు వెళ్లాడు. మందు తాగుతూనే అస్వస్థతకు గురైన కృష్ణ అక్కడే పడిపోయాడు. పక్కనే ఉండే వారు చూసి కృష్ణ చనిపోయినట్టు నిర్ధారిం చుకున్నారు . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కృష్ణ మృతిపై ఆరా తీశారు. మద్యం తాగడం వల్లే కృష్ణ చనిపోయాడని స్థానికులు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదుచేసుకుస్నట్టు పోలీసులు తెలిపారు.