రాష్ట్రపతి పదవిపై మాయావతి ఆసక్తికర కామెంట్లు

రాష్ట్రపతి పదవిపై మాయావతి ఆసక్తికర కామెంట్లు

లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దేశ ప్రధాని కావాలని ఉందని, రాష్ట్రపతి కావాలనే ఆకాంక్ష ఏ మాత్రం లేదని చెప్పారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్‌ తనపై పుకార్లు పుట్టిస్తున్నారని మాయావ‌తి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి  బీఎస్పీ ఓట్లను బీజేపీకి ఇచ్చేసిందని అఖిలేష్‌ ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా మాయావతి రాష్ట్రపతి అవుతారేమో అంటూఅఖిలేష్‌ యాదవ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో తాజాగా అఖిలేష్‌కు మాయావతి కౌంటర్‌ ఇచ్చారు. 

అంబేద్కర్‌, కాన్షీరాం బాటలోనే తాను నడవాలనుకుంటున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. ద‌ళితులు, అణ‌గారిన వ‌ర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, యూపీ సీఎం, ప్రధాని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సుఖ‌వంత‌మైన జీవితాన్ని కోరుకోవ‌డం లేదని బెహన్ జీ వెల్లడించారు. మాయావతి సన్నిహితురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా, ఆ పార్టీ ఏకైక యూపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్‌లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.