'దృశ్యం 2' ట్రైలర్ రిలీజ్

'దృశ్యం 2' ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గన్, టబు జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం 2’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర నిర్మాత అభిషేక్ పాఠక్ గోవాలో విడుదల చేశారు. పనోరమ స్టూడియోస్ సమర్పించిన దృశ్యం 2 ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. శ్రేయ పాత్ర ప్రేక్షకుల్ని మరింత ఆకర్షించనుంది.  

ఈ సినిమా వచ్చే నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అజయ్ దేవ్ గన్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. 2015లో విడుదలైన దృశ్యంకి సీక్వెల్ గా ఈ సినిమాను చిత్రీకరించారు. అదే పేరుతో 2013లో మలయాళంలోనూ ఈ సినిమా వచ్చింది.

దృశ్యంలో అజయ్ పాత్రలో విజయ్ సల్గావ్కర్ తన పెద్ద కుమార్తెకు సంబంధించిన ఒక సంఘటన పోలీస్ కేసు వరకు వెళ్లడం, ఆపై పోలీసు విచారణ తర్వాత దారితీసిన సమస్యల నుంచి.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం చూపించారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా దృశ్యం 2 ను రూపొందించారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది.