పాకిస్తాన్‌‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి

పాకిస్తాన్‌‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్ దాడి
  • పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ రద్దు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై గురువారం డ్రోన్ దాడి జరిగింది. గురువారం రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌‌ఎల్)లో భాగంగా పెషావర్ జాల్మీ, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే డ్రోన్​దాడి కారణంగా మ్యాచ్​ను రద్దు చేశారు. డ్రోన్​దాడిలో స్టేడియం కొంతమేర దెబ్బతిన్నది. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు ఇండియాపై పాకిస్తాన్​ దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిగా లాహోర్‌‌లోని ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను భారత్  ధ్వంసం చేసింది.