సాగు నీటి దినోత్సవానికి  స్పందన  కరవు..

సాగు నీటి దినోత్సవానికి  స్పందన  కరవు..

ఖానాపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణం జేకే గార్డెన్ లో బుధ వారం నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి స్పందన కరవైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు హాజరయ్యారు.  

Also Read:కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు

నియోజకవర్గం నుంచి దాదాపు 2000 మందికి పైగా రైతులు రావాల్సి ఉండగా కేవలం 200 మంది మాత్రమే  హాజరయ్యారు. సదస్సులో బీఆర్ఎస్​ ప్రజా ప్రతినిధులు, నాయకులు,  పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో కనిపించారు.