
గండిపేట, వెలుగు: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు పట్టుకుని రూ.7.50 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్స్టేషన్ లో డీసీపీ యోగేశ్ గౌతమ్ వివరాలను వెల్లడించారు. మంచిరేవుల సమీపంలో అనంత్కుమార్(50), వీరబాబు(32), కార్తీకేయ శేఖర్ కొకైన్ కలిగి ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. నార్సింగి పోలీసులు, టీజీఏఎన్బీ ఈగల్ అధికారులు మంచిరేవుల సమీపంలో అనంత్కుమార్, వీరబాబును పట్టుకుని 107.4 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కార్తీకేయ శేఖర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.