
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి మందుబాబు హల్ చల్ చేశాడు. హైదరాబాద్ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో వెంకటేశ్ భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. అతడు నిత్యం మద్యం తాగి భార్యను వేధిస్తున్నాడు. శనివారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య లక్ష్మిపై దాడి చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్ మద్యం మత్తులో కరెంట్ పోల్ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.