
హైదరాబాద్, వెలుగు : బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు సీనియర్ పోలీస్ అధికారి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ను ఎలక్షన్ కమిషన్ ఎంపిక చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్గా 2023 అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది.
గురువారం జేఎన్టీయూలో జరిగిన ఓటర్స్ డే సెలబ్రేషన్స్లో గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును డీఎస్ చౌహాన్ అందుకున్నారు.