
సదాశివనగర్, వెలుగు: గణేశ్ పండుగను గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. శనివారం సదాశివనగర్ రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్గౌడ్, ఎస్సై పుష్పరాజ్, వివిధ గ్రామాల గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
తాడ్వాయి: గణేశ్ ఉత్సవాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తాడ్వాయి ఎస్సై మురళి హెచ్చరించారు. శనివారం ఆయన తాడ్వాయిలో యూత్ సభ్యులకు ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిమజ్జనం రోజు ఎవరూ మద్యం సేవించవద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు శివాజీ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు జక్కుల రాజిరెడ్డి, యువకులు పాల్గొన్నారు.