
- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి
దుబ్బాక, వెలుగు: ప్రొటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి ఆరోపించారు. శనివారం అక్భర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి మాట్లాడారు. మంత్రి గడ్డం వివేక్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దుబ్బాకకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ప్రొటోకాల్, ఫ్లెక్సీలో ఫొటో చిన్నగా పెట్టారని గొడవ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలని మంత్రిని కోరాల్సిన ఎమ్మెల్యే గొడవలకు ఆజ్యం పోయడం తగదన్నారు.
జిల్లా ఇన్చార్జి మంత్రులు దుబ్బాకకు వచ్చినప్పుడల్లా మాజీ మంత్రి హరీశ్రావు కనుసైగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగడం వారి దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి నిధులను తీసుకురావడానికి శాయశక్తులా పని చేస్తున్నారన్నారు. పదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్రెడ్డి నియోజకవర్గానికి ఒక్క పైసా తీసుకురాలేదని ఆరోపించారు. కార్యక్రమంలో యాదగిరి, లక్ష్మి, యాదగిరి, సుకన్య పాల్గొన్నారు.