ప్రొటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నరు : పాతూరి వెంకటస్వామి

ప్రొటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నరు : పాతూరి వెంకటస్వామి

 

  • బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి 

దుబ్బాక, వెలుగు: ప్రొటోకాల్​ పేరుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బ్లాక్ ​కాంగ్రెస్​ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి ఆరోపించారు. శనివారం అక్భర్​పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్​ కాపీలను అందజేసి మాట్లాడారు. మంత్రి గడ్డం వివేక్​ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దుబ్బాకకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్​ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ప్రొటోకాల్, ఫ్లెక్సీలో ఫొటో చిన్నగా పెట్టారని గొడవ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలని మంత్రిని కోరాల్సిన ఎమ్మెల్యే గొడవలకు ఆజ్యం పోయడం తగదన్నారు.

జిల్లా ఇన్​చార్జి మంత్రులు దుబ్బాకకు వచ్చినప్పుడల్లా మాజీ మంత్రి హరీశ్​రావు కనుసైగల్లో బీఆర్ఎస్​ కార్యకర్తలు గొడవకు దిగడం వారి దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇన్​చార్జి శ్రీనివాస్​రెడ్డి నిధులను తీసుకురావడానికి శాయశక్తులా పని చేస్తున్నారన్నారు. పదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్​రెడ్డి నియోజకవర్గానికి ఒక్క పైసా తీసుకురాలేదని ఆరోపించారు. కార్యక్రమంలో యాదగిరి, లక్ష్మి, యాదగిరి, సుకన్య పాల్గొన్నారు.