
హైదరాబాద్: మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు నానా యాతన పడ్డారు. హైటెక్ సిటీ నుంచి KPHB మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి మియాపూర్ మార్గంలో వరద నీరు రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్ జాం అయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్లో వర్షం పడిన ప్రతీసారి గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో వాహనదారులు ట్రాఫిక్ జాం కారణంగా నరకం చూస్తున్నారు.
వానొస్తే.. ట్రాఫిక్ జామ్లకు ఐటీ కారిడార్ కేరాఫ్గా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ ఐటీ హబ్గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు.. మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారుతాయి. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాదాపూర్బాటా షోరూం, నెక్టార్గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐఐటీ ఎదురుగా, గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరదనీరు నిలిచిపోతుంది. క్లియర్ అవ్వడానికి 2 గంటలు పడుతుంది. మూడు, నాలుగు లేన్ల రోడ్డులో కార్లు, బస్సులు, బైకులు ఒకటి, రెండు లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.
జేఎన్టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూట్ రెండు వైపులా, షేక్పేట్నుంచి ఖాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్అంతా ట్రాఫిక్ నిలిచిపోతుంది. వాన పడితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి మునిగిపోతుంది. దీంతో ఐటీ కారిడార్కు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు నల్లగండ్ల ఫ్లై ఓవర్ మీదుగా హైటెక్సిటీకి వెళ్తుండగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది.
Also Read:-హైదరాబాద్ లో దంచికొట్టిన భారీ వర్షం.. సికింద్రాబాద్ లో చెరువులను తలపించిన కాలనీలు..
ఆల్విన్ఎక్స్ రోడ్డు నుంచి గచ్చి బౌలి రూట్లో ప్రధాన రోడ్లలో వెళ్లే వాహనాలతో ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో, అల్టర్నేట్రూట్లో కూడా అంతే ఉంటుంది. సిటీలో వానపడితే బైక్లపై ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు సొంత కార్లలో వెళ్తుంటారు. అలా వెళ్లడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమని పోలీసులు ఉన్నతాధికారులు, ఎక్స్పర్ట్స్అంటున్నారు. ఫ్లై ఓవర్అండర్పాస్లు, లింకురోడ్లు ఉన్నా కూడా ట్రాఫిక్ రద్దీ పెరుగుతూనే ఉంది.
గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో ట్రాఫిక్ జాం pic.twitter.com/wvmHH490d6
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) July 18, 2025