దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీభత్సమైన వానలు కురుస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రం ధోల్ పూర్ లో కురిసిన వర్షాలతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇండ్లలోకి వరదనీరు రావడంతో బకెట్లతో తోడుతున్నారు. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నడుము లోతు మేరు రోడ్డుపై నీరు ప్రవహిస్తుండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Dholpur in Rajasthan faces heavy waterlogging after rain lashes the city pic.twitter.com/XQh337Lm3S
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 10, 2022
మరోవైపు రానున్న నాలుగు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది. అటు గుజరాత్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.