
మలయాళ హీరో ‘దుల్కర్ సల్మాన్’ అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘మహానటి’. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో లెఫ్టినెంట్ రామ్గా తెలుగు వాళ్లకు దుల్కర్ మరింత దగ్గరయ్యాడు. ఈ రెండు చిత్రాలను నిర్మించిన వైజయంతి సంస్థ తీస్తున్న మరో చిత్రంలోనూ నటించబోతున్నాడట దుల్కర్ సల్మాన్. ఆ సినిమా మరేదో కాదు.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీస్తున్న ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఓ కీలకపాత్రను దుల్కర్ సల్మాన్ పోషించబోతున్నాడట. తన క్యారెక్టర్ డ్యురేషన్ తక్కువే అయినప్పటికీ, కథకు ఎంతో ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ కావడంతో దుల్కర్ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ పాత్ర స్టోరీని మరింత ముందుకు నడిపించేలా ఉంటుందట. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కానుంది.