
- నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు
గచ్చిబౌలి, వెలుగు: ఇనార్బిట్ మాల్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగనున్న ది దుర్గం చెరువు రన్–2023 నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామన 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుమారు 4,500 మంది 21కే, 10కే, 5కే రన్ లో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
- కావూరిహిల్స్, సీవోడీ జంక్షన్నుంచి దుర్గం చెరువు మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్కు సైబర్ టవర్స్ జంక్షన్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
- జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా బయోడైవర్సిటీ వైపు వెళ్లే వెహికల్స్.. మాదాపూర్ పీఎస్, సీవోడీ జంక్షన్, సైబర్టవర్స్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్పాస్ మీదుగా చేరుకోవాలి.
- ఐటీసీ కోహినూర్ రోడ్, సీ గేట్ రోడ్, ఐవోసీఎల్ రోడ్, మైహోం అబ్రా లేన్, స్కై వ్యూ లేన్, ఓరియన్ విల్లాస్ న్యూ రోడ్ తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 10 గంటల వరకు క్లోజ్ ఉంటుంది.
- ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లలో ఉదయం 11 హెవీ వెహికల్స్కు పర్మిషన్ లేదు.