శీతాకాల సమావేశాలు 10 రోజులు నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

శీతాకాల సమావేశాలు 10 రోజులు నిర్వహించాలి : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని లేఖ

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత శీతాకాల సమావేశాలను కనీసం పది రోజులపాటు నిర్వహించాలని, సభకు సంబంధించిన ఎజెండాను ముందుగానే అందించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అప్పుడు మాత్రమే సభ్యులు ప్రిపేర్‌‌‌‌ అయ్యేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​కు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ‘‘శాసనసభను మొత్తంగా ఏటా కనీసం 50 రోజుల పాటు నిర్వహించాలి. 

శాసనసభకు సంబంధించి అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలి. స్థాయి సంఘాల(స్టాండింగ్‌‌‌‌ కమిటీల) ఏర్పాటుకు చొరవ చూపాలి. మహాత్మాగాంధీ నరేగా పునరుద్ధరించాలి’’అని పేర్కొన్నారు.