టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ కలిసి స్టెప్పులేసి అభిమానుల్లో జోష్ని నింపారు. చిరు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ ఓ ఇంటరెస్టింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంపార్టెంట్ సీన్స్తోపాటు వీరి కాంబోలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. న్యూ ఇయర్ గిఫ్ట్గా మంగళవారం ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటలో చిరు, వెంకీ హై ఎనర్జీతో డ్యాన్స్ చేశారు.
‘మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైంటీ.. ఎవడైతే ఏంటీ.. కుమ్మేద్దాం చంటి.. ఏ వెంకీ ఇచ్చేయ్ ధమ్కీ.. ఏ స్పీడేమో ఫైవ్ జీ.. స్టైల్ ఏమో జెన్జీ.. వారెవ్వా సర్ జీ.. వుయ్ ఆర్ సో క్రేజీ.. ఏ బాసూ.. పెంచేయ్ బేసు.. ఇంకేంటి బాసు సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. అరె ఏందీ వెంకీ సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి.. భయ్యా నువ్వు నెక్స్ట్ లెవల్.. బ్రో నువ్వే బెస్ట్ లెవల్.. యూ అండ్ మీ వేరే లెవల్.. ఇద్దరమొస్తే పీక్స్ లెవల్.. ’ అంటూ ఫెస్టివల్ వైబ్తో సాగిన పాట ఆకట్టుకుంది.
కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా, నక్ష్ అజీజ్, విశాల్ దద్లాని ఎనర్జిటిక్గా పాడారు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో చిరు, వెంకీల డ్యాన్స్ మూమెంట్స్, పబ్ బ్యాక్డ్రాప్లోని విజువల్స్ హైలైట్గా నిలిచాయి. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్ చేసిన అల్లరి, డ్యాన్స్, పెర్ఫార్మెన్స్ని ఆడియెన్స్ చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు అని సాంగ్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.
