ఉప్పల్‌ లో గంజాయి పెడ్లర్లు అరెస్ట్

ఉప్పల్‌ లో గంజాయి పెడ్లర్లు అరెస్ట్

ఉప్పల్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్​చేశారు. సీఐ ఓంకార్​తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​కు చెందిన సుధాన్ష్​కుమార్ ఉప్పల్​హనుమసాయినగర్​లో ఉంటూ గంజాయి అమ్ముతున్నాడు. ఉప్పల్​పరిసర ప్రాంతాల్లో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్​పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు మంగళవారం తనిఖీలు చేపట్టారు. 

సుధాన్ష్​కుమార్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 5 కిలోల గంజాయి, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నట్లు​సీఐ చెప్పారు. బిహార్​నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నాడని తెలిపారు. అతన్ని అరెస్ట్​చేసినట్లు పేర్కొన్నారు. ఎస్సై శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు. 

గంజాయి తరలిస్తున్న ముగ్గురు..

ఘట్​కేసర్, వెలుగు: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీలోని కాకినాడ నుంచి హైదరాబాదర్​కు కారులో గంజాయి తీసుకెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు యంనంపేట్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టారు. 

అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి చూడగా గంజాయి లభ్యమైంది. 52 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకొని, నిందితులు అంబర్​పేట్, పటేల్​నరగ్​కు చెందిన షేక్ పేర్వలీ, సఫిల్​గూడకు చెందిన ధరావత్ సుభాష్, మలక్​పేట్​కు చెందిన సిరిమల రవికుమార్ ను అరెస్ట్​చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.