మైసూరు మెరిసింది: వైభవంగా దసరా వేడుకలు

మైసూరు మెరిసింది: వైభవంగా దసరా వేడుకలు

మైసూరు: వరల్డ్ ఫేమస్ మైసూరు దసరా వేడుకలు రెండోరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో మైసూర్ ప్యాలెస్ దేదీప్యమానంగా కనిపించింది. రాజవంశానికి చెందిన ప్రమోదా దేవి ఒడెయర్ ఆధ్వర్యంలో ప్యాలెస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో కీలకమైన జంబూసవారి (ఊరేగింపు) కోసం ఏనుగులతో రీహర్సల్ చేశారు.