హెచ్ఎండీఏ ప్లాట్లకు పోటీపడుతున్న బిల్డర్లు

హెచ్ఎండీఏ ప్లాట్లకు పోటీపడుతున్న బిల్డర్లు

హెచ్ఎండీఏ భూముల ఈ – వేలం కొనసాగుతోంది. తుర్కయంజాల్, బహదూర్ పల్లి భూములకు ఇవాళ వేలం వేస్తున్నారు. తుర్కయంజాల్ లో తొమ్మిదిన్నర ఎకరాల్లో వేసిన లే అవుట్ లోని 34 ప్లాట్లకు వేలం వేస్తున్నారు. 600 నుంచి 1200 గజాల వరకు ఉన్న ప్లాట్ల కోసం బిల్డర్లు పోటీ పడుతున్నారు. గజానికి 40 వేల రూపాయిల ధర ప్రకటించింది సర్కార్. మరోవైపు బహదూర్ పల్లిలోని 51 ఫ్లాట్లకు కూడా ఇవాళే వేలం వేస్తున్నారు అధికారులు. గజానికి 25 వేల రూపాయిలుగా ప్రకటించింది ప్రభుత్వం. రేపటి నుంచి మూడు రోజుల పాటు తొర్రూర్ లోని 148 ప్లాట్లకు కూడా వేలం వేయనుండగా..గజానికి 20 వేలుగా ప్రకటించారు. ప్లాట్ల అమ్మకం ద్వారా సర్కార్ కు 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు.