
తిరుమల శ్రీవారికి భక్తులు అనేక విధాలుగా కానుకలు సమర్పిస్తారు. ధనము.. బంగారం.. వెండి ..ఇప్పడు మొబైల్ఫోన్స్ను స్వామివారి హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఫోన్లను టీటీడీ ఈ నెల 2,21 తేదీల్లో ఈ వేలం ద్వారా కొనుగోలు చేయవచ్చని టీటీడీ తెలిపింది. టీటీడీ నిర్వహించే ఈ వేలంలో ఫోన్లను ఎలా పర్చేజ్ చేయాలో తెలుసుకుందాం. . .
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన 74 లాట్ల మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది టీటీడీ. జూన్ 20 , 21వ తేదీల్లో ఆన్ లైన్ ద్వారా ఈ వేలం వేయనున్నారు. ఇందులో కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ - వేలం వేయనున్నారు.
►ALSO READ | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకట స్వామి..
ఈ వేలంలో పాల్గొనదలచిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులని టీటీడీ తెలిపింది. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలంలు). .. ఏఈవో ( వేలంలు), టీడీడీ హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu. ap.gov.in లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 - 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాలని టీటీడీ ప్రకటించింది.