![తైవానీస్ ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ కంపెనీ ఏసర్ నుంచి ఈ–బైక్.. ధర రూ.లక్ష](https://static.v6velugu.com/uploads/2023/10/e-bike-from-taiwanese-electronics-and_Vj7qIZRhsb.jpg)
హైదరాబాద్, వెలుగు: తైవానీస్ ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ కంపెనీ ఏసర్తో కలసి ‘మూవీ 125 4జీ’ ఎలక్ట్రిక్ బైక్ థింక్ ఈ–బైక్ గో తీసుకొచ్చింది. సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ దీనిని లాంచ్ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష. దీనిని డిజైన్ చేసి తయారు చేసింది తామేనని, ఏసర్ టెక్నాలజీ పరమైన మద్దతును ఇచ్చిందని థింక్ ఈ–బైక్ గో ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఏసర్ మూవీ 125 4జీ పట్టణ ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సాధారణ ప్రయాణికులతోపాటు హైపర్- లోకల్ ఫుడ్ డెలివరీ లేదా కిరాణా డెలివరీ వంటి వ్యాపారాలకూ అనువుగా ఉంటుందని తెలిపింది. ఇందులోని బ్యాటరీలను మార్చుకోవచ్చు. గ్రిప్ బాగా ఉండటానికి 16 అంగుళాల వీల్స్ అమర్చారు.
డ్రైవర్ అవసరాలకు తగ్గట్టుగా బైకును కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర- ప్రభుత్వాల రాయితీలు వర్తిస్తాయి. బైక్ యాక్సెసరీలను సులభంగా రిప్లేస్ చేయవచ్చని థింక్ఈ–బైక్ సీఈఓ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ చెప్పారు. సమీప భవిష్యత్తు లో ఈ–-సైకిళ్లు, ఈ–-బైక్లు, ఈ–-ట్రైక్లను లాంచ్ చేస్తామని ప్రకటించారు.