నందిగామలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు

నందిగామలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉదయం 7.31 నిమిషాలకు భూమి కంపించింది. 3, 4  సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామ వాసులు.. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. మరోవైపు టర్కీ, సిరియాలో భూకంపం విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో కూడా భూకంపఛాయలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నందిగామలో భూమి కంపించడం పై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంపానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే.. శాస్త్రవేత్తలు ముందుగానే తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.