పాకిస్థాన్‎లో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.4 తీవ్రత నమోదు

పాకిస్థాన్‎లో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.4 తీవ్రత నమోదు

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‎లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని భారత జాతీయ భూకంప  కేంద్రం వెల్లడించింది. భారత స్థానిక కాలమాన ప్రకారం గురువారం (మే 29) సాయంత్రం 4.06 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురియ్యారు.

ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇప్పటివరకు జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది. 

ఈ నెల (మే) మొదట్లో కూడా పాకిస్థాన్‎లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో 2025, మే 5 సాయంత్రం 4 గంటల సమయంలో పాకిస్తాన్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పేర్కొంది. రోజుల వ్యవధిలోనే  పాక్‎లో మరోసారి భూకంపం రావడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎తో అతలాకుతలమైన పాక్‎ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి.