
మణిపూర్లోని చురచంద్పూర్లో 2023 నవంబర్ 05 ఆదివారం సాయంత్రం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత: 3.1 గా ఉన్నట్లుగా వెల్లడించింది. భూమి కంపించండంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు తెల్లవారుజామున 1 గంటలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 3.6 తీవ్రతతో భూకంపం ఎన్ఎస్సి తెలిపింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.
Earthquake of Magnitude:3.1, Occurred on 05-11-2023, 17:42:04 IST, Lat: 24.23 & Long: 93.73, Depth: 30 Km ,Location: Churachandpur, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/mbYEexZ60J@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/OKI6NZsr37
— National Center for Seismology (@NCS_Earthquake) November 5, 2023