టీఆర్ఎస్ ను ఢీ కొట్టగలిగేది ఒక్క బీజేపీనే

టీఆర్ఎస్ ను ఢీ కొట్టగలిగేది ఒక్క బీజేపీనే

టీఆర్ఎస్ ను ఢీ కొట్టగలిగేది ఒక్క బీజేపీనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పల్లె గోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈటల దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందన్నారు. డబుల్ బెడ్ రూమ్, 57 ఏళ్లకే పెన్షన్, రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ ఓడిపోతే తప్ప బాగుపడమన్నారు.

అన్ని వర్గాల వారిని మోసం చెయ్యడంలో కేసీఆర్ సిద్ధహస్తుడని ఈటల అన్నారు. భీమా నెట్టెంపాడు కోయల్ సాగర్ ఎత్తిపోతల పనులు పూర్తి చెయ్యలేదన్నారు. పాలమూరు వలసలు ఆగలేదని..పాలమూరు గోస తీరాలంటే..టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.  బీజేపీ రాకెట్ వేగంతో దూసుకు పోతుందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాదే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.