కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర అన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తుక్కుగూడాలో పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్ పరిశీలించారు. కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని విమర్శించారు. ప్రతి నియోజకరవర్గంలో సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నారన్నరు. ప్రజలకు తనవంతు సహకారం అందించేందుకు అమిత్ షా వస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా.. ప్రధానమంత్రిని సైతం ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారన్నారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని... టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారన్నారు.