తనిఖీల్లో పట్టుబడ్డ 146 కిలోల బంగారం బిస్కెట్లు

తనిఖీల్లో పట్టుబడ్డ 146 కిలోల బంగారం బిస్కెట్లు

ఎన్నికల సమరంలో తమిళనాడులో ధన ప్రవాహం కొనసాగుతోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోయంబత్తూరు జిల్లా పులియాకులం ప్రాంతంలో ఓ వ్యాన్ ను తనిఖీ చేయగా.. 146 కిలోల బంగారం బిస్కట్లు లభ్యమయ్యాయి. గోల్డ్ కు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. బంగారం ఎవరిది, ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి వద్దకు తీసుకెళుతున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రలోభాల కోసం బంగరాన్ని తరలిస్తున్నట్లు భావిస్తున్నారు.

.