
- ఫలితాలు విడుదల చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్/ఓయూ, వెలుగు: రాష్ట్రంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లో అడ్మిషన్ కోసం నిర్వహించిన టీజీఈసెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 93.87 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఆదివారం ఓయూలో టీజీఈసెట్ ఫలితాలను ఓయూ వీసీ కుమార్తో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి రిలీజ్ చేశారు. ఈ నెల 12న నిర్వహించిన ఈసెట్కు 19,672 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 18,928 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 17,768 మంది క్వాలిఫై అయ్యారు. కాగా, మొత్తం 11 స్ట్రీమ్ల్లో పరీక్షలు నిర్వహించారు. దీనిలో సీఎస్ఈలో 4,728 మందికి గాను 4,522 మంది, ఈసీఈలో 5,138 మందికి గాను 4,774 మంది, ఈఈఈలో 4,053 మందికి 3,719 మంది, సివిల్ ఇంజినీరింగ్లో 2,477 మందికి గాను 2,389 మంది అర్హత సాధించారు. సివిల్ ఇంజనీరింగ్లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కట్లే రేవతి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కాసుల శ్రావణి, మెకానికల్ ఇంజనీరింగ్లో పోతుగంటి కార్తీక్, మైనింగ్ ఇంజనీరింగ్లో కూర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన టాపర్లుగా నిలిచారు.