liquor scam : సిసోడియా కస్టడీ పొడిగింపు, ఏప్రిల్ 3 వరకు

liquor scam : సిసోడియా కస్టడీ పొడిగింపు, ఏప్రిల్ 3 వరకు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా కస్టడీని ఈడీ ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. మార్చి 20వ తేదీతో సిసోడియా కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించి సిసోడియాను కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరు పరుచనున్నారు ఈడీ అధికారులు. 

లిక్కర్ స్కాంలో మరో నిందితుడు, కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ కూడా మార్చి 20వ తేదీతో ముగిసింది. దాంతో ఈడీ అధికారులు కాసేపట్లో పిళ్లైని కూడా రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ముందు హాజరు పరుచనున్నారు.

రెండో సారి ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితను ఈడీ.. కన్ ఫ్రంటేషన్ విధానంతో విచారించింది. 4 గంటలకుపైగా కవిత విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో పిళ్లైతో కలిసి ఈడీ కవితను విచారించింది. ఈ విచారణలో సౌత్ గ్రూప్ వ్యక్తులతో సంబంధాలపై ఈడీ ఆరా అధికారులు తీస్తున్నారని తెలుస్తోంది.