రాష్ట్రంలో వివిధ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు జూన్ 22న కూడా కొనసాగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి మేనేజ్మెంట్ కోటాలో అధిక మొత్తాలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలతో ఇవి జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్,సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు కళాశాలలే టార్గెట్ గా కనిపిస్తోంది.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చెందిన కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ అజయ్వైద్య కళాశాలలో సైతం ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం 6 కాలేజీల్లో ప్రారంభం కాగా కొన్నింట్లో పూర్తయ్యాయి. ఇందులో పలువురు అధికారులతో కూడిన బృందం పాల్గొంది.