
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. ఆడిటర్ బుచ్చిబాబును విచారణకు పిలిచింది. బుధవారం (సెప్టెంబర్ 6న) ఉదయం నుంచి ఈడీ కార్యాలయంలో బుచ్చిబాబు విచారణ కొనసాగుతోంది. గతంలో ఎమ్మెల్సీ కవితకు బుచ్చిబాబు ఆడిటర్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గా ఈడీ నుంచి బుచ్చిబాబుకు పిలుపు వచ్చింది.