బాసర IIIT విద్యార్థుల ఆందోళనపై విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి మరోసారి ట్వీట్ చేశారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదన్నారు. ఎండలో, వానలో విద్యార్థులు కూర్చోవడం మంత్రిగానే కాకుండా.. ఒక అమ్మగా బాధేస్తుందన్నారు.
బాసర IIIT విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి. pic.twitter.com/87JtOvN9gq
— SabithaReddy (@SabithaindraTRS) June 18, 2022
‘ఇది మీ ప్రభుత్వం. దయచేసి చర్చించండి. ఆందోళన విరమించండి. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సమస్యలు పరిష్కారం కోసం డైరెక్టర్ ను నియమించామని, చర్చల కోసం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ను కూడా పంపించామన్నారు మంత్రి సబిత.