ఈషా కచ్చితంగా భయపెడుతుంది

ఈషా కచ్చితంగా భయపెడుతుంది

రీసెంట్‌‌గా ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్ హిట్‌‌ను అందుకున్న అఖిల్ రాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’. తనతోపాటు  త్రిగుణ్, హెబ్బా పటేల్ ఇతర  లీడ్ రోల్స్‌‌లో నటించారు.  శ్రీనివాస్ మన్నె  తెరకెక్కించిన ఈ చిత్రాన్ని   కేఎల్‌‌ దామోదర ప్రసాద్‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని  డిసెంబర్  25న థియేట్రికల్ రిలీజ్  చేస్తున్నారు. 

ఈ సందర్భంగా అఖిల్ రాజ్ మాట్లాడుతూ ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. ఆడిషన్ చేసి దర్శకుడు శ్రీనివాస్ నన్ను సెలెక్ట్ చేశారు.  ఈ కథ చెప్పగానే  షాకింగ్‌‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్‌‌ అయ్యాను.  హారర్‌‌ థ్రిల్లర్స్ చూసే  వారికి కొత్త అనుభూతినిస్తుంది.  ట్విస్టులు, సౌండ్‌‌ డిజైనింగ్‌‌  థియేటర్‌‌‌‌లో గొప్ప ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను ఇస్తాయి. తప్పకుండా అందర్నీ భయపెట్టే సినిమా ఇది.

 నిజంగా హార్ట్ వీక్‌‌గా ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడలేరేమో.   ఇందులో  వినయ్‌‌  పాత్రలో కనిపిస్తా.   నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని.  త్రిగుణ్‌‌, సిరి, హెబ్బా పటేల్‌‌, మైమ్‌‌ మధులతో  కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నా.  వెర్సెటైల్‌‌ యాక్టర్‌‌  అనిపించుకోవడం నాకు ఇష్టం. డిఫరెంట్ రోల్స్ చేయాలనుంది. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.  అన్‌‌సెట్స్‌‌లో తరుణ్‌‌భాస్కర్‌‌, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నా’ అని చెప్పాడు.