పాకిస్తాన్​కు 100 కోట్ల​ డాలర్ల రుణం ...ఈఎఫ్ఎఫ్ రెండో విడత సాయం కింద విడుదల చేసిన ఐఎంఎఫ్​

పాకిస్తాన్​కు 100 కోట్ల​ డాలర్ల రుణం ...ఈఎఫ్ఎఫ్ రెండో విడత సాయం కింద విడుదల చేసిన ఐఎంఎఫ్​

కరాచీ: పాకిస్తాన్​కు ఎక్స్‌‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్)  ప్రోగ్రామ్ కింద అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)  రెండో విడతగా 1.023 బిలియన్ డాలర్ల (100 కోట్ల డాలర్లు) రుణాన్ని విడుదల చేసింది.  పాకిస్తాన్​త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పై ఐఎంఎఫ్​ వర్చువల్​ మీటింగ్​ ప్రారంభించిన ఒకరోజు తర్వాత  ఈ రుణాన్ని విడుదల చేసింది.ఈ మేరకు  ఐఎంఎఫ్​ ఒక ప్రకటన విడుదల చేసింది.  అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను చెల్లించకుండా.. ఆ డబ్బుతో సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్​కు కొత్తగా రుణం ఇవ్వొద్దంటూ భారత్‌‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది.

దేశంలో నెలకొన్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో ఇస్లామాబాద్​లో ఐఎంఎఫ్ మిషన్​ పర్యటన వాయిదా పడగా.. ఐఎంఎఫ్​ మిషన్​ మే 16 వరకు పాక్​ ప్రభుత్వంతో  వర్చువల్​గా సమావేశాలు నిర్వహిస్తున్నది.  కాగా,  రెండో విడత కింద తాము విడుదల చేసిన సాయం పాక్​ విదేశీ మారక నిల్వల్లో పెరుగుదలను చూపుతాయని ఐఎంఎఫ్​ తెలిపింది.  పాకిస్తాన్​ ప్రభుత్వం 2025–-26 ఆర్థిక సంవత్సరానికి జూన్ 2న బడ్జెట్‌‌ను ప్రకటించాలని యోచిస్తున్నది. కాగా, ఈఎఫ్ఎఫ్​ కింద గత వారమే ఐఎంఎఫ్​ పాకిస్తాన్​కు రెండో విడత రుణసాయాన్ని ఆమోదించింది. అలాగే, రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ  కోసం  1.4 బిలియన్​ డాలర్లు అదనంగా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.