సహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్​విండో చైర్మన్లు

సహకార సంఘాల బలోపేతానికి కృషి : సింగల్​విండో చైర్మన్లు

బోధన్/ పిట్లం/ నవీపేట్/ భిక్కనూరు, వెలుగు: రైతులందరికీ సకాలంలో రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని, సహకార సంఘాల బలోపేతానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగల్​విండో చైర్మన్లు కోరారు. శనివారం సాలూరా, పిట్లం మండలం చిన్నకోడబ్​గల్, నవీపేట్​ మండలం బినోల, భిక్కనూరు అంతంపల్లి సొసైటీల్లో మహాజన సభలు నిర్వహించారు.

ఏడాదిలో జరిగిన ఖర్చులు, ఆదాయాల వివరాల వెల్లడించారు. సాలురా సొసైటీ చైర్మన్​ అల్లె జనార్ధన్​ మాట్లాడుతూ.. బ్యాంక్​లోన్​ ద్వారా 250 మెట్రిక్​​ టన్నుల గోదాం, దుకాణాల సముదాయం నిర్మాణాలకు సంఘం సభ్యులు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.చిన్నకొడప్​గల్​ సొసైటీ చైర్మన్​నారాయణరెడ్డి మాట్లాడుతూ..రుణమాఫీ  అయిన రైతులందరికీ కొత్త అప్పులు ఇవ్వాలని కోరారు. సంఘం పరిధిలోని కాటేపల్లిలో కొత్త ఆఫీసు నిర్మించాలని ఆ గ్రామ రైతులు కోరారు.