హైదరాబాద్ లో ఎస్టీ ఎఫ్ ఏ టీం దాడులు.. ధూల్ పేట్ లో 8 కిలోల గంజాయి పట్టివేత

 హైదరాబాద్ లో  ఎస్టీ ఎఫ్ ఏ టీం దాడులు..  ధూల్ పేట్ లో 8 కిలోల గంజాయి పట్టివేత

మెహిదీపట్నం, వెలుగు: ధూల్​పేట్​లో 8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్​పోలీసులు తెలిపారు. ధూల్​పేట్​లోని దిల్వార్ గంజ్ ప్రాంతంలో రాజ్ అలియాస్ కబూతర్ వాలా రాజాసింగ్, తుల్జారాం సింగ్ గంజాయి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ఏ టీం ఆదివారం దాడులు నిర్వహించింది. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి గంజాయితోపాటు గంజాయి ప్రెస్సింగ్ మెషీన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు పేర్కొన్నారు.