అమీన్పూర్ జర్నలిస్టుపై దాడి కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమీన్పూర్ జర్నలిస్టుపై దాడి కేసులో  8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమీన్​పూర్​, వెలుగు: జర్నలిస్ట్​ విఠల్​పై జరిగిన దాడి కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8న ఉదయం 3 గంటల సమయంలో  కొందరు వ్యక్తులు జర్నలిస్టు విఠల్​ ఇంటిని ధ్వంసం చేసి అతడిపై దాడికి దిగారు. ఉదయం సీఐ నరేశ్​కు జర్నలిస్టులతో కలిసి విఠల్​ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ విజయరావు పోలీస్​ సిబ్బందితో కలిసి విచారణ జరిపారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించారు. మధు అలియాస్​మధుసూదన్, వంశీ, నల్లమల్ల శివప్రసాద్, యుగేందర్, కొత్త సంపత్, కుంచాల బ్రహ్మయ్య, సల్లడి హరీశ్, కోడూరి స్వరాజ్​ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్​ఐ తెలిపారు.  

తహసీల్దార్, జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం

అమీన్​పూర్​ తహసీల్దార్​ వెంకటేశ్, జర్నలిస్టు విఠల్​పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం నాయకులు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. బీరంగూడలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అమీన్​పూర్​ మండల పరిధిలో కోట్ల విలువైన భూములు, పార్కు స్థలాలు, చెరువు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన తహసీల్దార్​పై, వార్తను కవరేజ్​ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సీపీఎం నాయకులు పాండురంగారెడ్డి, జార్జ్​, శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు.