మానవీయ కథనాలకు ఆద్యుడు లక్ష్మణ్రావు ఎడిటర్ కె.శ్రీనివాస్

మానవీయ కథనాలకు ఆద్యుడు లక్ష్మణ్రావు ఎడిటర్ కె.శ్రీనివాస్

పంజాగుట్ట, వెలుగు: సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్​రావు మానవీయ కథనాలకు ఆద్యుడని, పత్రికారంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని సీనియర్ ఎడిటర్​ కె.శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. పత్రిక రంగానికి తొలిపొద్దులా మారి గ్రామీణ జర్నలిస్టులను లక్ష్మణ్​రావు ఆదుకున్నారని గుర్తు చేశారు. సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, సతీశ్​చందర్, వసంతలక్ష్మి, శివాజీ, ప్రెస్‌‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.