ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపాడు అన్న. తల నరికి శరీరం నుంచి వేరుచేసి అత్యంత కర్కశంగా హత్య చేశాడు. పంట పొలంలో ఈ దారుణం చేసి పరారయ్యాడు.
పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన రామాంజనేయులుకి తన తమ్ముడు రాజ కుల్లాయప్ప(40)తో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. వివాదాలు పెరగడంతో తమ్ముడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు అన్న రామాంజనేయులు. ఊరి శివారులోని తోటలో తల నరికి చంపేసి పరారయ్యాడు. కిరాతకంగా హత్య చేసిన రామాంజనేయులు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.